ఏపీజీబీ బ్యాంక్ ఖాతాదారులకు అవగాహన సదస్సు
Published: Wednesday March 01, 2023
బోనకల్, ఫిబ్రవరి 28, ప్రజా పాలన ప్రతినిధి: నాబార్డ్ వారి ఆర్థిక సహాయంతో కళాజాతర మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆధ్వర్యంలో రావినూతల గ్రామంలో , బ్యాంకు ఖాతాదారులకు, లావాదేవీల గురించి, అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. బ్యాంకు మేనేజర్ బి సీతారామ రాములు మాట్లాడుతూ: ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమ యోజన(436), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (20), అటల్ పింఛన్ యోజన, ప్రమాద బీమా ఇన్సూరెన్స్ గురించి, వ్యవసాయ లోన్స్, డ్వాక్రా మహిళల లోన్స్ చెల్లించుట గురించి తెలియజేశారు. డబ్బుల లావాదేవీల్లో ఆర్థిక నేరాలు జరగకుండా ఎలా ఉండాలో మ్యాజిక్ షో ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉపేందర్, గ్రామ దీపికలు కృష్ణకుమారి, శైలజ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Share this on your social network: