వీఆర్ఏల కు పేస్కేల్ జీవో వెంటనే విడుదల చెయ్యాలి: వీఆర్ఏ, జేఏసీ జిల్లా నాయకులు తాసిల్దార్ కా
Published: Tuesday July 26, 2022
బోనకల్, జులై 25 ప్రజా పాలన ప్రతినిధి:వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుకై తలపెట్టిన నిరవధిక సమ్మె బోనకల్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ప్రారంభం అయినది. ఈ సందర్బంగా వీఆర్ఏ, జేఏసీ జిల్లా ఉపాద్యక్షులు మరీదు వెంకట్, జిల్లా కార్యదర్శి పులుసు వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షులు సుధాకర్, కార్యదర్శి కిరణ్ లు మాట్లాడుతూ పే స్కేల్ జీవో అమలు చేసే వరకు నిరవదిక సమ్మె కొనసాగుతుందని, 55 సంవత్సరాలు నిండిన వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, అర్హత కలిగిన ప్రతి వీఆర్ఏకు ప్రమోషన్లు ఇవ్వాలని ఈ సందర్బంగా తెలియచేసారు.ఈ కార్యక్రమంలో మండలంలో వివిధ గ్రామాలకి చెందిన వీఆర్ఏలు పాల్గొన్నారు.
Share this on your social network: