సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిది ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Wednesday August 24, 2022
మేడిపల్లి, ఆగస్టు23 (ప్రజాపాలన ప్రతినిధి)
 సీఎం రిలీఫ్ ఫండ్ అనారోగ్య సమయంలో పేదలకు వరం లాంటిదని
 ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే నివాసంలో  సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న చిలుకా నగర్ ,హబ్సిగూడ , రామంతపూర్ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి చేతులమీదుగా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులు ఎన్. గోపాల్ రెడ్డి రూ 36,000/,రూ రామ్ దాన్ 60,000/,రూ రేష్మ 60,000/, కే. నిర్మల రూ 56,000/, ఏం ఆనంద్ రూ 42,000/, ఓ. నరసింహస్వామి రూ 28,000/, ఏం. నవ్య శ్రీ రూ 20,000/, ఉమాకాంత శెట్టి
16,000, యాకయ్య 1,00,000, రూపాయలు, ఏ. యాకయ్య రూ 75,000/ చెక్కులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి, బన్నల ప్రవీణ్ ముదిరాజ్, గరిక సుధాకర్,డాక్టర్ బి.వి చారి , లక్ష్మీనారాయణ, కాటపల్లి రవీందర్ రెడ్డి, రెడ్డి నాయక్, యకాంతరావు జెసిబి రాజు, తదితరులు పాల్గొన్నారు.