మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు
Published: Monday April 26, 2021
సిద్దిపేట, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 17వ వార్డ్ టి ఆర్ ఎస్ అభ్యర్థి తరపున మంత్రి హరీష్ రావు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలికి మట్టి అంటకుండా రోడ్లు వేశామని, ఈ వార్డ్ లో ఎవరూ కూడా ఇల్లు లేనివారు ఉండవద్దని, ఓట్ల కోసం వచ్చే వాళ్ళు కావాలో ఆపదలో మీ వెన్నంటి సహాయసహకారాలు అందించేవారు కావాలో మీరే నిర్ణయించు కోవాలి అన్నారు. ఒకనాడు సిద్దిపేటలో నీళ్ల కోసం చాలా గోస పడ్డామని, సిద్దిపేట అబ్బాయికి పిల్లనివ్వాలంటే నీళ్ల గోస చూసి వెనుకంజ వేసేవారని, నాడు సిద్దిపేట పందులకు ప్రసిద్ధి అని నేడు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు. పట్టణంలో కోతులు, దోమల బెడదలు తీరాయన్నారు. టి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులకు తప్ప డూప్లికేట్ వాళ్ళకు ఓటు వేయొద్దని, పగటి వేషగాల్లను నమ్మొద్దన్నారు.
Share this on your social network: