ఆర్టీసీ ప్రయాణం సురక్షితం

Published: Friday December 30, 2022

మధిర డిసెంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి) ఆర్టీసి బస్సులలో ప్రయాణం ఎంతో సురక్షితం అని మధిర డిపో మేనేజర్ ఎస్ దేవదానం అన్నారు. గురువారం మధిర మండలం ఖాజీపురం గ్రామంలో నిర్వహించిన ప్రజల వద్దకు ఆర్టీసి కార్యక్రమం ఫై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ పొందిన డ్రైవర్లు ఆర్టీసి బస్సులు నడపడం వలన ప్రయాణం సురక్షితంగా ఉంటుందన్నారు. ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించవద్దని ఆర్టీసి బస్సులలో ప్రయాణం చేయాలని ఆయన కోరారు. ప్రయాణికులకు పలు రకాల రాయితీలను ఆర్టీసి కల్పిస్తుందని ఆయన గుర్తు చేశారు. సంస్థ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆర్టీసి మనది, మనందరిది అని గుర్తించి అందరూ ఆర్టీసి బస్సులలోనే ప్రయాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హుస్సేన్, జి ఆర్ రెడ్డి ఆర్టీసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.