ఉపాధ్యాయులకు దిక్సూచి యూటీఎఫ్ డైరీ

Published: Thursday January 05, 2023

మధిర జనవరి 4 ప్రజాపాలన ప్రతినిధి) ఉపాధ్యాయ, ఉద్యోగులకు టీఎస్ యూటీఎఫ్ డైరీ దిక్సూచి వంటిదని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలి తెలిపారు. స్థానిక యూనియన్ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం ఏ వినోదరావు అధ్యక్షతన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన యూనియన్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని కోరారు. జీవో నెంబర్ 317 అప్పీల్స్ అన్నింటిని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13,14న హైద్రాబాద్ లో జరగనున్న యూటీఎఫ్ 5వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం యూనియన్ 2023 సంవత్సరం డైరీ, క్యాలెండర్, అధ్యాపక దర్శిని, స్టిక్కర్ క్యాలెండర్లను ఎంఈఓ వై ప్రభాకర్, ఎస్ బీఐ సిరిపురం బ్రాంచ్ మేనేజర్ వీరాస్వామి, యూనియన్ జిల్లా పూర్వ కార్యదర్శి తాళ్లూరి ఆంజనేయులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వీరయ్య, లాల్ అహ్మద్, జిబిఎంఎస్ రాణి, భాస్కరరావు, సాధు సమాధానం, కొండలరావు, రాజు, చెన్నయ్య, మీరాఖాన్, ఆశీర్వాదం, పివి రమణ, వాణి, కవిత తదితరులు పాల్గొన్నారు.