వేతనాల పెంపు హర్షణీయం : కోరుట్ల మండల జెడ్పీటీసీ దారిషేట్టి లావణ్య

Published: Thursday June 17, 2021
కోరుట్ల, జూన్ 16 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల పట్టణoలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ, వి.ఆర్.ఏ, వి.ఏ.ఓ మరియు మరి కొన్ని శాఖలకు 30 శాతం జీతాలు పెంచు నందున కోరుట్ల జడ్పిటిసి దారిశెట్టి లావణ్య ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, ఎంపీపీ తోట నారాయణ, జగిత్యాల జిల్లా రైతు అధ్యక్షుడు చీటి వెంకట్రావు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.