మండలంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన.

Published: Wednesday February 16, 2022
పలు కార్యక్రమాలలో పాల్గొన్న రేఖానాయక్
జన్నారం రూరల్, పిబ్రవరి 15, ప్రజాపాలన : ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ మండలంలో మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పలుగ్రామాలు సందర్శించి అయా గ్రామాల్లో నిర్వహించిన అభివృద్ధి, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ సంత్ సేవాలాల్ 283వ జయంతి వేడుకల్లో బాగంగా మండల కేంద్రంలో లంబాడ కులస్తులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సేవాలాల్ జెండా ను ఆవిస్కరించారు. అనంతరం చంద్రు నాయక్ తండా లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హైద్రాబాద్ లో బంజారాల కోసం బంజారా భవనం గత యాడది ప్రారంభోత్సవం చేసుకున్నాం అన్నారు. ఇప్పటికే ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో బంజారా భవనం ప్రారంభం కొద్దీ రోజుల్లో కానుంది తెలిపారు. అదేవిధంగా జన్నారం మండల కేంద్రం లో ముఖ్య మంత్రి  కెసిఆర్  జన్మదిన వేడుకలలో బాగంగా  ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం బవనంను ప్రారంబించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి కోసం గ్రామ సర్పంచ్ జాడి గంగాధర్ నిరంతరం కృషి చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం కవ్వాల్ గ్రామంలో నిర్వహిస్తున్న ఎల్లమ్మతల్లి బోనాల కార్యక్రమంలో పాల్గొననున్నారు. మొక్కులు తీర్చుకొనేందుకు వచ్చిన బక్తులతో కలిసి ఎల్లమ్మతల్లికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మా దాడి సరోజన రవీందర్రావు, వైస్ ఎంపీపీ సుతారి వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీపతి బుచ్చన్న, వైస్ చైర్మన్ సిటిమల భరత్ కుమార్, కో- ఆప్షన్ సభ్యులు మున్వర్ అలీ ఖాన్, తిమ్మాపూర్ సర్పంచి డాడీ గంగాధర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యం సతీష్, పొన్కల్ సర్పంచ్ జక్కు భూమేష్, నాయకులు సిందం చంద్రయ్య, వార్డు సభ్యులు, టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.