ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 25 ప్రజాపాలన ప్రతినిధి *క్రికెట్ క్రీడలు ప్రారంభానికి ముఖ్య అతిథ

Published: Monday December 26, 2022

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల కేంద్రంలోని దండేటికార్ శర్పంజి గార్డెన్ ప్రక్కన మంచాల మండల యువజన విభాగం అధ్యక్షుడు వనపర్తి బద్రీనాథ్ గుప్తా  నిర్వహించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్) మంచాల మండల ప్రీమియర్ లీగ్ ను భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి) ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు మానసికంగా శారీరకంగా ఎంతో చకచక్యంగా ఉండటం కోసం ఆరోగ్యం మెరుగుపరుడు కోసం యువతకు క్రీడోత్సవాలు ఎంతో అవసరం క్రీడలు యువతకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అని. మండల పరిధి జిల్లా స్థాయికి రాష్ట్ర స్తాయికి ఎదుగుదలకు కృషి చేస్తుందని. భవిష్యత్తులో జీవనం కొనసాగించడం కోసం ఎంతో తోడ్పాటు ఇస్తుందని. ( బంటి) ప్రశాంత్ కుమార్ రెడ్డి తెలిపారు, బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చీరాల రమేష్ యాచారం మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్, మండల ప్రధాన కార్యదర్శి కాట్రోత్ బహుదూర్, పిఎసిఎస్ చైర్మన్ బుస పుల్లారెడ్డి, నాయకులు భద్రమోని యాదయ్య, జానకిల కిషన్ రెడ్డి, ఎడమ జంగారెడ్డి, నూతన గంటి శేఖర్, అమరేందర్ రెడ్డి, ప్రశాంతి యాదవ్, యాదగిరి, రావుల శంకర్, చిందం జంగయ్య, చీర వంశీ, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు,