12 రోజులు...375 కిలో మీటర్లు యాత్రలో రాహుల్గాంధీ తో పాటు యాత్రలో పాల్గొన్న అంజని.

Published: Wednesday November 09, 2022
పాలేరు నవంబర్ 8 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్గాంధీ తెలంగాణ లో చేపట్టిన భారత్ జోడో యాత్ర లో నేలకొండపల్లి కి చెందిన యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని పాల్గొన్నారు. గత నెల 23 న తెలంగాణ లో మక్తల్ వద్ద ప్రారంభమై...ఈ నెల 7 న జుక్కల్ నియోజకవర్గం లో ముగిసింది. మొత్తం 12 రోజుల పాటు, 19 నియోజకవర్గాలు, ఏడు పార్లమెంట్ నియోజకవర్గాలను కలుస్తూ సాగిన యాత్ర మొత్తం 375 కిలో మీటర్ల సాగింది. మొదటి నుంచి రాహుల్గాంధీ తో పాటు పాదయాత్ర పూర్తైయ్యే వరకు నడిచారు. ఈ సందర్భంగా మంగళవారం నేలకొండపల్లిలో విలేకర్ల సమావేశం లో మాట్లాడారు... రాహుల్గాంధీ, తో పాటు అన్ని రోజులు కలిసి పాదయాత్ర చేయటం సంతోషంగా - ఉందన్నారు. తనను రాహుల్ గాంధీ. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు లు భుజం తట్టి అభినందించటం జీవితంలో మరవలేనిది