* బిఆర్ఎస్ యువ నాయకులు వడ్ల నందు వికారాబాద్ బ్యూరో 18 జనవరి ప్రజా పాలన : అనారోగ్యంతో మృతి చెందిన
Published: Thursday January 19, 2023
* బిఆర్ఎస్ యువ నాయకులు వడ్ల నందు
వికారాబాద్ బ్యూరో 18 జనవరి ప్రజా పాలన : అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబ సభ్యులకు అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహకారం అందజేశామని బిఆర్ఎస్ యువ నాయకులు వడ్ల నందు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వడ్ల నందు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంట్వారం మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు గుర్రపు నరేష్ తండ్రి గుర్రపు చెంద్రయ్య అనారోగ్యంతో మరణించారు. మరణించిన విషయాన్ని సమీప నాయకుల ద్వారా తెలుసుకొని మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. బిఆర్ఎస్ యువ నాయకులు వడ్ల నందు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5 వేల రూపాయలు అందించడం జరిగింది. మానవతా కోణంతో ఆలోచించి ఆర్థిక సాయం అందించడం జరిగిందని తెలిపారు.
Share this on your social network: