ఈటెల రాజేందర్ ను పరామర్శించిన మంచిర్యాల జిల్లా ముదిరాజ్ మహాసభ నాయకులు
Published: Saturday September 03, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 2 ప్రజా పాలన ప్రతినిధి:
మాజీ మంత్రి హుజురాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ తండ్రి ఈటెల మల్లయ్య ఇటీవల మరణించగా ముదిరాజ్ మహాసభ మంచిర్యాల జిల్లా నాయకులు శుక్రవారం స్వగ్రామం కమలాపూర్ లో ఆయనను కలిసి పరామర్శించారు. కీర్తిశేషులు ఈటెల మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులందరినీ కలిసి సంతాపం తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజు మహా సభ రాష్ట్ర కార్యదర్శి ములకలపల్లి వెంకటేశ్వర్లు, మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు, డి, భాస్కర్, పొలవేన కనకయ్య, కార్యవర్గ సభ్యులు తాళ్ల కృష్ణమోహన్, నిమ్మల శ్రీనివాస్, ముద్ర వేణి కిరణ్, దండ వేణ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: