మహాత్మ జ్యోతిరావు పూలే ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలి : మున్సిపల్ కౌన్సిలర్ మడవెని నరేష్

Published: Monday November 29, 2021

కోరుట్ల, నవంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళి లు అర్పించిన కోరుట్ల మున్సిపల్ కౌన్సిలర్ మదవెని నరేష్. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ సమాజంలోని కులపరమైన వివక్షను అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడు మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు. జ్యోతిరావు పూలే ఆలోచన విధానానికి, ఆశయాలకు అనుకులగుణంగా కులమతాలకు అతీతంగా కలిసి మెలిసి వుండి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.