డిటిడిఓ ను సరెండర్ చేయాలని కలెక్టర్ కు వినతి ** విద్యార్థి యువజన సంఘాల నాయకులు **

Published: Wednesday April 12, 2023

ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 10 (ప్రజాపాలన,ప్రతినిధి) : ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో అవినీతికి పాల్పడుతున్న డిటిడిఓ ను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్రావుకు, విద్యార్థి యువజన సంఘాల నాయకులు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  విద్యార్థులకు 2022 - 23 విద్యాసంవత్సరానికి పంపిణీ చేయాల్సిన ప్లేట్స్ మరియు గ్లాసులు నేటికీ పంపిణీ చేయలేదని అన్నారు. పంపిణీ చేసినట్లుగా రూ 11,59,000, వేలు డిటిడిఓ విత్ డ్రా చేయడం జరిగిందన్నారు. దీనిపై అధికారులు సమగ్ర విచారణ జరిపి డిటిడిఓ ను వెంటనే సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు దుర్గం దినకర్, ఆత్మకూరి చిరంజీవి, గోడిసెల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు