కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Published: Friday August 20, 2021
బోనకల్లు, ఆగస్టు 19, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీఎం కెసిఆర్ ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశానికే గర్వకారణం అంటూ బోనకల్ మండలంరాపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో సీఎం కెసిఆర్ చిత్ర పటానికి ఎం టీ ఆర్ యువసేన తరుపున పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీవాసులు బీసీ కాలనీవాసులుఎం టీ ఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.