ఓటరు జాబితా కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలి ** జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం **

Published: Thursday November 24, 2022
ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 23 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం అన్నారు. బుధవారం కలెక్టరేట్ భవనంలో జిల్లా అదరపు కలెక్టర్ చాంబర్లో కాగజ్ నగర్ ఆర్డీవో రాజేశ్వర్ తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి అధికారులతోసమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సవరణలో ఇలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన జాబితా తయారు చేసేందుకు అధికారులు, రాజకీయ పార్టీల నాయకులుసమన్యాయంతో పనిచేయాలనిఅన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమములో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.