9 న తమ కుల ప్రజాప్రతినిధులను సన్మానించునున్న తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం.

Published: Friday July 08, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
 
నూతనంగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కమిటీ వారి ఆధ్వర్యంలో తమ కులానికి చెందిన తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులనుకాచిగూడ లోని మ్యాడం అంజయ్య హాల్ లో సన్మానించునున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్బంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశం లో మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 9 న నిర్వహించనున్న సన్మాన సభలో పార్టీలకు అతీతంగా తమ కుల ప్రజాప్రతినిధులను సన్మానిస్తూ,తమ కుల సమస్యల పరిష్కారానికి చర్చించనున్నట్లు, మున్నూరు కాపులకు పది ఎకరాల స్థలం,20 కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో పాటు జనరల్ బాడీ తీసుకున్న నిర్ణయాలను సభ ముందుంచనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మనికొండ వెంకటేశ్వర రావు,మంగళారపు లక్ష్మణ్, లింగిశెట్టి హన్మంత్ రావు తదితరులు పాల్గొన్నారు.