పల్లె ప్రగతి కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంతసురేష్

Published: Friday May 27, 2022

జగిత్యాల, మే 26 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ టి.ఎస్.ఆర్.డిలో పంచాయితీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు పల్లె ప్రగతి పై  సమీక్షా సమావేశం నిర్వహించారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా చైర్ పర్సన్ దావ వసంతసురేష్ హాజరైనారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల జెడ్పీ చైర్ పర్సన్లు, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ శరత్, ప్రత్యేక కమిషనర్ ప్రసాద్ మరియు జడ్పీ సీఈఓలు పాల్గొన్నారు.