పల్లె ప్రగతి కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంతసురేష్
Published: Friday May 27, 2022
జగిత్యాల, మే 26 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ టి.ఎస్.ఆర్.డిలో పంచాయితీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు పల్లె ప్రగతి పై సమీక్షా సమావేశం నిర్వహించారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా చైర్ పర్సన్ దావ వసంతసురేష్ హాజరైనారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల జెడ్పీ చైర్ పర్సన్లు, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ శరత్, ప్రత్యేక కమిషనర్ ప్రసాద్ మరియు జడ్పీ సీఈఓలు పాల్గొన్నారు.
Share this on your social network: