రూ 79 లక్షలతో సీసీ రోడ్డు డ్రైనేజీ పనులు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

Published: Monday June 27, 2022
మేడిపల్లి, జూన్26 (ప్రజాపాలన ప్రతినిధి) 

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్    28వ డివిజన్లోని సాయి ఎంక్లేవ్ కాలనీలో రూ 40 లక్షలతో సీసీ రోడ్డు,రూ 39 లక్షలతో డ్రైనేజి పనులను స్థానిక కార్పొరేటర్ చీరాల నరసింహ,మేయర్ సామల బుచ్చిరెడ్డిలతో కలిసి  కార్మికశాఖామాత్యులు చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బింగి జంగయ్య యాదవ్,కొత్త చందర్ గౌడ్,సుమన్ నాయక్, కో అప్షన్ సభ్యులు బుర్ర దత్తాత్రేయశాస్ర్తీ ,రంగ బ్రహ్మన్న గౌడ్, సీనియర్ నాయకులు మోదుగు శేఖర్ రెడ్డి,కొత్త చక్రపాణి,దానగళ్ల యాదగిరి, కృపాసాగర్,గుర్రాల వెంకటేష్ యాదవ్,జక్కల రాములు తదితరులు పాల్గొన్నారు.