ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు వేంటనే భర్తీ చేయాలి

Published: Wednesday June 30, 2021
- బిజెవైయం జిల్లా అధ్యక్షుడు బండ విజయ్ రాజ్ ముదిరాజ్
వికారాబాద్, జూన్ 29, ప్రజాపాలన బ్యూరో : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కొరకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు బండ విజయ్ రాజ్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా శాఖ అద్యర్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వేంటనే భర్తీ చేయాలని నిరసన ప్రదర్శన చేసి, వినతి పత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ కు అందజేశారు. ఈ సందర్భంగా బిజెవైయం జిల్లా అద్యక్షుడు విజయరాజ్ మాట్లాడుతూ  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాద్యాయ, లెక్చరర్ పోస్ట్ ల తో పాటు ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు వేంటనే నోటిఫికేషన్ విడుదల చెయాలని డిమాండ్ చేశారు. తెరాస ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వస్తే నిరుద్యోగ యవతకు ఉద్యోగ భృతి చెల్లిస్తామని మాయమాటలు చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేశారని దెప్పి పొడిచారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి మనసు మార్చుకుని నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు పరచాలని కోరారు. కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన ప్రైవేట్ లెక్చరర్లు టీచర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు పాండు గౌడ్, యు రమేష్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షురాలు సుచరితా రెడ్డి, కిసాన్ మోర్చ రాష్ట్ర నాయకులు కుర వెంకటయ్య, దళిత మోర్చ జిల్లా అద్యక్షుడు నవిన్ కుమర్, జిల్లా కార్యదర్శి హరి కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి కార్యక్రమంలో వివిధ మండల బిజెపి, బిజెవైయం నాయకులు పాల్గొన్నారు.