ధాన్యం కొనుగోలు కేంద్రలను ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Published: Wednesday April 28, 2021
పరిగి, ఏప్రిల్ 27, ప్రజాపాలన ప్రతినిధి : నియోజక వర్గం, పరిగి మండల పరిధిలోని రాఘవపూర్,సుల్తాన్ పూర్ గ్రామలలో మంగళవారం పౌరసరఫరాల సంస్థ(DCMS) ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి, DCCB చైర్మన్ మనోహర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని రైతులకోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చాడని ఇంకా మంచి పథకాలు తెస్తాడాని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, హరిప్రియ ప్రవీణ్ రెడ్డి, సురేందర్, సర్పంచ్ జగన్, ఎంపీటీసీ ఉమాదేవిలు గ్రామస్తులు పాల్గొన్నారు.
Share this on your social network: