కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి

Published: Thursday February 23, 2023
మేడిపల్లి, ఫిబ్రవరి 22 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ నియోజకవర్గంలోని చిల్కానగర్ డివిజన్లో మధుర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల రోజుల నుంచి ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి బుధవారం సందర్శించి శిక్షణ తరగతులు ఏ విధంగా జరుగుతున్నాయని శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్న నిర్వాహకురాలు మరియు శిక్షణ పొందుతున్న వారిని అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి కావాల్సిన సదుపాయాలు మరియు మెటీరియల్స్ అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వంజరి సంతోష్, ఉప్పల్ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ నరేష్, నిమ్మ సురేందర్ రెడ్డి, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.