ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి **వడ్డెర సమస్యలపై ఎమ్మెల్యే మంచిరెడ్డిని కలి
వడ్డెర కార్మికుల హక్కులను, కులవృత్తి కాపాడటం తోపాటు వారి జీవనోపాధి దెబ్బతీయకుండా వారికి మైనింగ్ భూమి కేటాయించాలని కోరుతూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ని కలసి కోహెడ వడ్డెర కార్మికులు వినతిపత్రం అందజేశారు. అబ్దుల్లాపూర్మెట్ మండలం తుర్కయంజాల్ మున్సిపాలిటీ కోహేడ గ్రామ పరిధిలో సర్వేనెంబర్ 774లో ఏ. 4-00 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి ని కోరారు. పూర్తి విషయాలను పరిశీలించి వడ్డెర కార్మికులకు న్యాయం చేస్తానని అ భూమిపై వడ్డెర కార్మికులకు హక్కులు కల్పించే విధంగా రెవిన్యూ అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటానని వడ్డెర కార్మికులతో హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లపు విగ్నేష్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పి. శివకుమార్, వడ్డెర సంఘం అధ్యక్షులు పల్లపు శివ కుమార్, ఆంజనేయులు , జంగయ్య, సతీష్, పల్లపు దాసు, గోవర్ధన్ సాయి, అనిత,ఆండాలు, మహేశ్వరి తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.
Share this on your social network: