అధైర్య పడకండి ధైర్యంగా ఉండండి : కరోనా పేషెంట్లతో మేయర్ జక్క వెంకట్ రెడ్డి
Published: Saturday May 08, 2021
మేడిపల్లి, మే7 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్ను పట్టణ మేయర్ జక్క వెంకట్ రెడ్డి సందర్శించారు. కోవిడ్ బారిన పడిన వారిని పలకరించి అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని మేయర్ సూచించారు. వారి ఆరోగ్య స్థితిగతుల గురించి డాక్టర్ను అడిగి తెలుసుకోవడంతో పాటు వారికి అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. అనంతరం కోవిడ్ కేర్ సెంటర్ ను సానిటైజ్ చేయించారు.
Share this on your social network: