మధిర సెప్టెంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి పరిధిలో బుధవారం నాడు బంజారా కాలనీ
Published: Thursday September 15, 2022
లోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని మధిర కోర్టు జూనియర్ సివిల్ జడ్జి శ్రీ డిధీరజ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహం యొక్క పరిసరాలు పూర్తిగా పరిశీలించారు. విద్యార్థులకు ఇచ్చే ఆహార పదార్థాలను తనిఖీ చేశారు హాస్టల్ పరిసరాలని క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి వసతి గృహంలో ఉన్న విద్యార్థినులతో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థినులు అందరూ కష్టపడి చదివి దేశ భవిష్యత్తు నిర్మాణంలో పాలు పంచుకోవాలని, హాస్టల్ లో ఏమైనా ఇబ్బందులు గాని, అసౌకర్యాలు గాని ఉన్న ఎడల మండల న్యాయ సేవా అధికార సంస్థ కు తెలియజేయాలని, ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ హాస్టల్ సంక్షేమ అధికారి జి.వరలక్ష్మి, న్యాయ సేవా అధికార సంస్థ బాధ్యులు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: