హైదరాబాద్ COE కళాశాలకు ఎంపికైన మాటూర్ హైస్కూల్ విద్యార్థి సాధం రామకృష్ణ

Published: Tuesday June 01, 2021
మధిర, ప్రజాపాలన ప్రతినిధి : 31వ తేదీ మధిర మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్య కోసం కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఏర్పాటుచేసిన సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (COE) కళాశాలలో టాప్ కాలేజీ ఐనటువంటి గౌలిదిద్ది(IIT) కళాశాలకు మధిర మండలంలోని మాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి సాదంరామకృష్ణఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.సాయి కృష్ణమాచార్యులు ఒక ప్రకటనలో తెలియజేశారు. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు TSWRIES వారు మార్చి నెలలో నిర్వహించినటువంటి ఎంట్రన్స్లో మెరిట్ ఆధారంగా ఈరోజు వెలువరించిన ఫలితాల్లో సాధo రామకృష్ణ ఒక్కడే మధిర మండలం నుంచి ఎంపికవ్వడం గొప్ప విషయంగా మదిర మండల విద్యాశాఖ అధికారిశ్రీ Y ప్రభాకర్ గారు పేర్కొoటూ రామకృష్ణకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల HM గారు మాట్లాడుతూ 2 సంవత్సరాల క్రితం రామకృష్ణ జాతీయ ప్రతిభ పరీక్ష NMMS నందు జిల్లా మొదటి ర్యాంకు సాధించాడని గుర్తు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మేడిశెట్టి లీలావతి, SMC చైర్మన్ మేడిశెట్టి రామకృష్ణారావు, MPTC అడపాల వెంకటేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయులు రామకృష్ణకు అభినందనలు తెలిపారు.