జడ్పిలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

Published: Wednesday January 04, 2023
* జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 3 జనవరి ప్రజా పాలన :  జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. జడ్పి అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సునీతారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జడ్పి సీఈఓ జానకీరెడ్డి, డిప్యూటీ సీఈఓ శుభాషిణి, ఈఈ శ్రీనివాస్ రెడ్డి, డీఈ లు, జడ్పి కార్యాలయ సిబ్బంది, నాయకులు హన్మంత్ రెడ్డి, వడ్ల నందు తదితరులు సునీతారెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.