గర్భిణీ స్త్రీలకు"కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ" ** జడ్పిటిసి అరిగేల నాగేశ్వర్ రావ్ **

Published: Saturday December 31, 2022
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 30 (ప్రజాపాలన,ప్రతినిధి) :
ఆసిఫాబాద్ మండలం బూరుగుడ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డాక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలలో రక్తహీనత తగ్గించటం తో పాటు మరియు పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండాలన్న లక్స్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెడుతున్న నూతన పథకం" కెసిఆర్ పౌష్టికహర కిట్ లను" 37 మంది గర్భిణీ స్త్రీలకు అందజేశారు. ఈ సందర్భంగా  జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని, సీఎం గర్భిణీ స్త్రీలకు అందజేస్తున్న కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ల ను గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిగెల మల్లికార్జున యాదవ్, డాక్టర్ సత్యనారాయణ,సర్పంచ్ మాధవి, ఏఎన్ఎం పద్మ, మరియు ఆశ వర్కర్లు, ఆసుపత్రి సిబ్బంది, గర్భిణీలు పాల్గొన్నారు.