తుర్క యంజాల్లో జరిగే సిపిఎం పార్టీ రాష్ర్ట మహాసభలను జయప్రదం చేయండి

Published: Monday December 06, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 5 ప్రజాపాలన ప్రతినిధి : సిపిఎం పార్టీ తెలంగాణ మూడవ రాష్ట్ర మహాసభల సందర్భంగా మాస్ క్యాంపెయిన్ చేస్తున్న ఎంగెల్ గూడ సిపిఎం పార్టీ గ్రామ శాఖ సిపిఎం పార్టీ మండల కమిటీ నాయకులు ఆవాజ్ కమిటీ నాయకులు ఉస్మాన్ ఆధ్వర్యంలో ఎంగల్ గూడా గ్రామంలో సిపిఎం పార్టీ కార్యకర్తలు ప్రజా సంఘాల కార్యకర్తలు పండు క్యాంపెయిన్ చేయడం జరిగింది ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యల పైన పనిచేస్తున్న పార్టీ సిపిఎం పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు పార్టీ తోడ్పతారని విరాళాలు అందివ్వాలని వారిని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ కార్యదర్శి మాచర్ల యాదగిరి. దానయ్య, ప్రభాకర్, కృష్ణ, నరసింహ, సీనియర్ నాయకుడు ముత్తయ్య, యాదయ్య, సుధాకర్, బాబు, జంగయ్య, అచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.