టిఆర్ఎస్ పాలనలోనే మధిర అభివృద్ధి

Published: Tuesday July 26, 2022

మధిర జులై 25 ప్రజా పాలన ప్రతినిధి టిఆర్ఎస్ పాలనలోనే మధిర అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. ఐదు కోట్ల రూపాయల నిధులతో పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ నిర్మాణ పనులకు సోమవారం మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ కష్టాలు తెలిసిన వ్యక్తి కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం వలన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతోందన్నారు.టిఆర్ఎస్ పాలనలో మధిర నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. మధిర చెరువు కట్టను ట్యాంక్ బాండగా మార్చే నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. అంబేద్కర్ సెంటర్ సుందరీకరణ, సెంటర్ లైటింగ్ లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగిందన్నారు. వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు అతి త్వరలోనే పూర్తి చేసి మున్సిపాలిటీ ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా కృషి చేస్తామని ఆయన అన్నారు. మధిర అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఐటి మరియు పురపాలక శాఖ కల్వకుంట్ల తారక రామారావుకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మదిర మున్సిపాలిటీ కమిషనర్ అంబటి రమాదేవి ఏఈ నరేష్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరావు మధిర సొసైటీ అధ్యక్షులు బిక్కి కృష్ణ ప్రసాద్ మున్సిపల్ కౌన్సిలర్స్ వైవి అప్పారావు, కట్టా గాంధీ, ఎర్రగుంట లక్ష్మి, ధీరావత్ మాధవి గద్దల మాధురి వీరమాచినేని నాగ సులోచన వంకాయలపాటి వెంకట నాగేశ్వరావు మొండితోక జయకర్ అరిగే శ్రీనివాసరావు కొఠారి రాఘవరావు జెవిరెడ్డి ఎర్రగుంట రమేష్ కపిలవాయి జగన్మోహన్రావు పళ్ళపోతు ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.