టీపీసీసీ చీఫ్ గా ఎంపీ రేవంత్ రెడ్డి నియామకం పై కొలిపాక శ్రీనివాస్ హర్షం

Published: Monday June 28, 2021
మేడిపల్లి, జూన్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా మేడ్చల్-మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డిని నియమించడం పట్ల మేడ్చల్ జిల్లా పద్మశాలి సంఘం అధికార ప్రతినిధి కొలిపాక శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధ్యక్షులుగా ఎన్నికైన రేవంత్ రెడ్డి  తెలంగాణలోని 33 జిల్లాల్లో పర్యటించి గ్రూప్ రాజకీయాలకు గుడ్బై చెప్పెలా ఐక్యంగా పార్టీ నేతలందరిని ఏకం చేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి రావడానికి కృషి చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించినందుకు  సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ,రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.