వైయస్సార్ టిపికి శీలం వెంకట రెడ్డి రాజీనామా

Published: Monday October 11, 2021
మధిర, అక్టోబర్ 10, ప్రజాపాలన ప్రతినిధి : వైయస్సార్ తెలంగాణ ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ మధిర భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకట రెడ్డి, తన వ్యక్తి గత కారణాల దృష్ట్యా వైయస్సార్ తెలంగాణ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనను ఇప్పటివరకు ప్రోత్సహించిన వైస్సార్ టిపి అధినేత్రికి, ఇతర నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకతీతంగా ఇప్పటివరకు, ప్రోత్సహించిన అభిమానులకు స్నేహితులకు బంధువులకు అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటిలాగానే ప్రజలకు రాజకీయాలకతీతంగా సేవలు అమలు చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు