మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో హైపొక్లోరిన్ ద్రావణం పిచికారీ

Published: Monday April 19, 2021
మధిర, ఏప్రిల్ 18, ప్రజాపాలన ప్రతినిధి : పట్టణంలోని మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతా, కమిషనర్ అంబటి రమాదేవి ఆధ్వర్యంలో 15, 16 వార్డులలో మరియు ప్రభుత్వ హాస్పిటల్, టౌన్ పోలీస్ స్టేషన్ లాలో మున్సిపాలిటీ సిబ్బంది హైపోక్లోరైట ద్రావణాన్ని పిచికారి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వే అధికంగా ఉండటం వలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్కు తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.