మంద కృష్ణమాదిగను పరామర్శించిన బోనకల్ మండల ఎమ్మార్పీఎస్ నాయకులు
బోనకల్లు, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : ఎస్సీ వర్గీకరణ అమలు చేసే బాధ్యతగా కేంద్ర పెద్దలను కలుసుకొనుటకు ఢిల్లీ వెళ్లిన మంద కృష్ణమాదిగ ఢిల్లీ హోటల్లో ప్రమాదశావత్తు జారీ కిందపడి కాలికి గాయం కావడం జరిగింది. ఢిల్లీలో వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించగా నెల రోజులు అనంతరం హైదరాబాద్ లో తన స్వగృహం చేరుకున్నారు ఈ సమాచారం తెలుసుకొని ఎమ్మార్పీఎస్ బోనకల్ మండల నాయకులు హైదరాబాద్ లో క్రిష్ణమాదిగ ఇంటికెళ్ళి పరామర్శించి అన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి అనంతరం క్రిష్ణమాదిగతో మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులు మరియు కోట్లాది మంది బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రేమాభిమానాలతో త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కోట హనుమంతరావు మాదిగ అధికార ప్రతినిధి తోటపల్లి చిన్నసైదులు జిల్లా సీనియర్ నాయకులు మొండితోక అఫ్జల్, తాటికొండ వెంకటరత్నం, ఎమ్ ఎస్ ఎఫ్ నాయకులు చిలక నాగరాజు, తోటపల్లి వెంకటేశ్వర్లు, తోటపల్లి భూపతి, మండల గౌరవ అధ్యక్షులు తోటపల్లి, సాల్మన్ రాజ్ మాదిగ పాల్గన్నారు.
Share this on your social network: