కెర్చిపల్లి లో

Published: Monday August 16, 2021
మండల పరిధిలోని కేర్చిపల్లి గ్రామంలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అలాగే పలుచోట్ల జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ లో కె.వసంత 36వేలు, ఎల్.సత్తయ్య 26వేలు, డి కిష్టయ్య 60, వేల రూపాయలు విలువ గల చెక్కులు భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో మంజూరు అయిన చెక్కులను సర్పంచ్ మద్దెల మంజుల నాగరాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కె.డంగయ్య, కె.సత్తిరెడ్డి, అశోక్ రెడ్డి మల్లేష్, పంచాయతీ కార్యదర్శి ఏ.స్వప్న, గ్రామపంచాయతీ వార్డ్ నెంబర్లు, సిబ్బంది యువకులు తదితరులు పాల్గొన్నారు.