మానవత్వం చాటుకున్న ఎస్ఐ సతీష్ కుమార్

Published: Thursday July 08, 2021
మధిర, జులై 07, ప్రజాపాలన ప్రతినిధి : మధిర టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. బుధవారం రైల్వే స్టేషన్ కి వెళ్ళే దారిలో అండర్ బ్రిడ్జి కింద వృద్ధురాలు పిడీచల్ వచ్చి పడిపోవడంతో అటుగా వెళ్తున్న ఎస్ఐ ఆ సంఘటనను చూసి వెంటనే ఓ ఆటోను ఆపి ఆ వృద్ధురాలను మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. అక్కడే ఉన్న వారు ఎస్ఐ సతీష్ కుమార్ మానవత్వాన్ని చూసి ప్రజలు అభినందించారు.