మాల మహానాడు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా పెయ్యలగీత
Published: Thursday August 05, 2021
హైదరాబాద్, ఆగస్టు 04, ప్రజాపాలన ప్రతినిధి : మాల మహానాడు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా పెయ్యలగీత ఏకగ్రీవ ఎన్నిక అయినట్లు తెలిపారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య నియామక పంత్రంను అందజేసినట్లు తెలిపారు. హైదరాబాదులోని మాలమహానాడు జాతీయ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నాడు జరిగినది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం తిరుమలగిరి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన పెయ్యాల గీతను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి రవి ముఖ్య అతిథిగా హాజరైనారు. నల్గొండ జిల్లా అధ్యక్షులు మల్ల మధు బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గ అధ్యక్షులు మాల లింగయ్య అధ్యక్షతన పేయ్యల గీతను ఏకగ్రీవంగా ఎన్నిక చేసి నియామక పత్రాన్ని అందజేశారని తెలిపారు. కార్యక్రమంలో మిర్యాలగూడ పట్టణ అధ్యక్షురాలు పెరుమాళ్ళ ధనమ్మ, త్రిపురారం మండల అధ్యక్షురాలు అంగరాజు స్వర్ణలత, దామరచర్ల మండల యూత్ నాయకులు బైరం గోపి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: