133వ రోజుకు చేరిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర

Published: Saturday August 27, 2022
వికారాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ పి సుధారాణి
వికారాబాద్ బ్యూరో 26 ఆగస్టు ప్రజా పాలన : టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను చూసిన ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వికారాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ పి సుధారాణి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో వై.ఎస్.ఆర్.టి.పి వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల తన 133వ రోజు ప్రజాప్రస్థానం పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా వికారాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ పి సుధారాణి మాట్లాడుతూ వైఎస్ షర్మిల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర జన సందోహంతో కిటకిటలాడుతుందని పేర్కొన్నారు ప్రజా సమస్యలే పరిష్కారం లక్ష్యంగా పాదయాత్ర రామదండులా కొనసాగుతుందని స్పష్టం చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు చేదోడువాదాడుగా నిలుస్తామని వివరించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల పాదయాత్రకు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో మళ్లీ వైఎస్ పాలన వస్తుందని ప్రజల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వైఎస్ షర్మిల పాదయాత్రలో అడుగులో అడుగు వేసి ముందుకు కదులుతున్నామని వెల్లడించారు.