మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

Published: Friday June 25, 2021
కోరుట్ల, జూన్ 24 (ప్రజాపాలన ప్రతినిధి) : కల్లూరు గ్రామంలో కరోనా తో మృతిచెందిన జంగా లింబాద్రి కుటుంబాన్ని అలాగే ఉత్తమ్ సత్య గౌడ్ కుటుంబాన్ని కోరుట్ల శాసన సభ్యుడు విద్యాసాగర్ రావు పరామర్శించారు. జోగన్ పల్లి గ్రామ ఎంపిటిసి క్యాన్సర్ తో మరణించగా బుదవారం రాత్రి వారి యొక్కకుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారని జోగన్ పల్లి గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజ నర్సయ్య, కల్లూరు గ్రామ సర్పంచ్ వనతడుపుల అంజయ్యలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, ఎంపీపీ తోట నారాయణ పాల్గొన్నారు.