జానకిపురం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Published: Monday January 09, 2023

బోనకల్, జనవరి 8 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలో జానకిపురం ఉన్నత పాఠశాలలో ఆదివారం 2001 బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరుపుకున్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు సీతారాం దాస్ మాట్లాడుతూ జీవితంలో విలువలు కలిగి జీవించి ఉన్నంతగా రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శుభకర దాస్, వెంకట్ రెడ్డి ,వీరభద్రం, జాన్, సలీం ,సుచరిత, స్రవంతి, కోటయ్య, రమణారావు ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కోట బాను షహన్, సయ్యద్ నాగుల్ మీరా, శ్రావణ్ కుమార్, ఫణి కుమార్, రేణుక, వసంత, స్రవంతి, లక్ష్మి, జి.వి.ఆర్, సావిత్రి, కే నవీన్, చిరంజీవి పాల్గొన్నారు.