ప్రధాని నరేంద్రమోడీ నిండునూరేళ్ళు జీవించాలి

Published: Tuesday January 11, 2022
జిల్లా బిజెపి అధ్యక్షుడు తొడిగల సదానంద్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 10 జనవరి ప్రజాపాలన : ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు కలకాలం జీవించాలని జిల్లా బిజెపి అధ్యక్షుడు తొడిగల సదానంద్ రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి మందిరంలో జిల్లా అధ్యక్షులు సదానంద్ రెడ్డి దంపతుల ఆద్వర్యంలో పూజలు నిర్వహించి మ్రుత్యుంజయ హోమం నిర్వహించారు. కార్యక్రమం అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ భారత రాజకీయలలో ఎన్నడు లేని విధంగా ప్రధానమంత్రికి పాటించవలసిన ప్రొటొకాల్ పాటించకుండా పంజాబ్ ప్రభుత్వం ప్రధానిని ప్రమాదంలోకి నెట్టెయ్యాలని పిరికిపంద చర్య అని విమర్శించారు. పాకిస్తాన్ బార్డర్ కు అతి సమీపంలో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడడం దురదృష్టకరం అని వెంటనే పంజాబ్ కాంగ్రేస్ ప్రభుత్వంపై చర్యలు తీస్కొవాలని డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలన్ని కూడా భారత ప్రధానిని ప్రపంచ నాయకుడిగా గుర్తించాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నీతిమాలిన చర్యలకు పాల్పడడం బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటి శివరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్షి పాండు గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, సుచరిత రెడ్డి, రాఘవ నాయక్, పట్టణ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, నరోత్తం రెడ్డి, నవీన కుమార్, శివప్రసాద్, అమరేందర్ రెడ్డి, ప్యాట శంకర్, శివరాజ్ గౌడ్, సతీష్, శిరీష, నాయకులు పాల్గొనారు.