అన్ని దానాల కంటే అన్నదానం మిన్న

Published: Monday July 18, 2022

మధిర  జులై 16 ప్రజాపాలన ప్రతినిధి అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని ఆర్యవైశ్య సంఘం నాయకులు స్వామి సతీష్ కపిలవాయి జగన్ మోహన్ రావు అన్నారు. శనివారం వర్తక సంఘం వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద దాతల ఆర్ధిక సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చే విధంగా ప్రతి శనివారం వర్తక సంఘం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద దాతల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఆడంబరాలకు మితిమీరి ఖర్చులు చేయకుండా పేదల ఆకలి తీర్చే విధంగా అన్నదానాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. అదేవిధంగా బంజారా కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాతలు ఆర్ధిక  సహకారంతో ఏర్పాటు చేసిన అన్న దానాన్ని ఆలయ చైర్మన్ గుండెల ముత్తయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాతలు భక్తులు పాల్గొన్నారు.