మట్టి గణపతి చేసిన పదవ తరగతి విద్యార్థి నగేష్

Published: Thursday September 01, 2022

రాయికల్, ఆగస్టు 31 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలంలోని  లోక్య నాయక్ తండాలోని భూక్యనగేష్ పదవ తరగతి విద్యార్థి మట్టి వినాయకుడిని తయారుచేసి తన ప్రతిభను చాటాడు. ఐనా ఆలోచనలో దిట్ట ఏదైనా ప్రయోగం చేయడంలో ఆసక్తి చూపడం ఇతని యొక్క అలవాటు,తండాలో ఎప్పుడు రంగుల వినాయకుడిని ప్రతిష్టించేవారు.ఈసారి పర్యావరణ రక్షణలో నేను ఒక సైనికుడిని అంటూ తానే స్వయంగా మట్టి వినాయకుడిని తయారు చేయడం జరిగిందని,అలాగే అందరు కూడా ఇలా చేస్తే సమాజంలో ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళము అవుతామని నగేష్ తెలపడం జరిగింది. అంతేకాకుండా పలువురు తండావాసులు ఎంతో అద్భుతంగా మట్టి వినాయకుడిని చిత్రీకరించినందుకు అభినందించారు.