సర్కిల్ ఇన్స్పెక్టర్ కు సన్మానం

Published: Thursday May 20, 2021

బెల్లంపల్లి, మే 19,  ప్రజాపాలన ప్రతినిధి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ముస్కే రాజును బెల్లంపల్లి మాల మహానాడు నాయకులు బుధవారం నాడు సన్మానించారు. బెల్లంపల్లి వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బుధవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి పూల మాలలు వేసి శాలువాలతో సన్మానించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసులు విధినిర్వహణలో పక్షపాతం లేకుండా ప్రజలకు సేవ చేయాలని, అన్ని వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందించి ప్రజల మన్నన పొందాలని వారు కోరారు, ఈ కార్యక్రమంలో మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుసుమ మధుసూదన్, రాష్ట్ర యువజన అధ్యక్షులు ఆసాది మధు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుంభాల రాజేష్, పట్టణ నాయకులు రాజేశం, బందెల మురళి, సంబోది శ్రీనివాస్, ముల్కల రాజేష్, ఎరుకల నర్సింగ్, కనకరాజు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.