కోరుట్ల పట్టణంలో ఘనంగా దుర్గా మాత బోనాలు

Published: Tuesday October 12, 2021
కోరుట్ల, అక్టోబర్ 11 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల పట్టణంలోని 22వ వార్డ్ లో ఆదివారం రోజున దుర్గామాతకి భక్తి శ్రద్ధలతో ఘనంగా నెత్తిన బోనాలు ఎత్తి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మడవేని నరేష్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఆతల్లి యొక్క చల్లని దీవెనలు అందరికీ లభించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మదవెని నరేష్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.