20వ డివిజన్ లో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం

Published: Thursday September 30, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 29, ప్రజాపాలన ప్రతినిధి : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలినీ కార్పొరేషన్ మేయర్ పేర్కొన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని 20వ డివిజన్ కార్పొరేటర్ పెద్ద బావి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛసర్వేక్షన్ లో భాగంగా స్వాత్రంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అజాది కా అమ్రిత్ మహోత్సవ్  ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్ తో పాటు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ... 20వ డివిజన్ లో నున్న కాలనీ వాసులకు ఇంటింటికి తడి చెత్త - పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరించే వారికి ఇవ్వాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, శానిటేషన్ ఇన్సిపెక్టర్ యాదగిరి నగర దీపికలు, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.