అంగరంగ వైభవంగా శివపార్వతుల రథోత్సవం
Published: Thursday March 03, 2022
రాయికల్, మార్చి 03 (ప్రజాపాలన ప్రతినిధి) : రాయికల్ పట్టణంలో గుడి కోట శ్రీ చెన్నకేశవ నాథ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినంలో భాగంగా రెండవ రోజున బుధవారమున దేవాది దేవుడైన శివుడికి ఆలయ అర్చకులు సతీష్ శర్మ, సత్యనారాయణ శర్మ వేద మంత్రాలతో రుద్రాభిషేకం చేశారు. అనంతరం శివపార్వతులను రథంపై ఆశీనులను చేసి, ఊరేగించారు. తదుపరి ఆలయ కమిటీ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, మున్సిపల్ కమిషనర్ గంగుల సంతోష్ కుమార్ ప్రాథమిక వ్యవసాయ సంఘం చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, పట్టణ వార్డు కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు తుమ్మల సదాశివ్ సుంకే శంకర్, మోర రామ్మూర్తి, తొపారపు ఆశన్న, నాగులపల్లి చిన్న గంగారెడ్డి, గంగాధర్ నాగరాజు, భక్తులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు
Share this on your social network: