మేడేపల్లి శ్రీనివాసరావుకు ఘనంగా పలువురు ప్రముఖులు సన్మానం

Published: Monday September 12, 2022
 మధిర రూరల్ సెప్టెంబర్ 11 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు పలువురు ప్రముఖులు ఎమ్మెస్సార్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు మేడేపల్లి శ్రీనివాసరావుకు హోమియో హాస్పిటల్ సిబ్బంది ఘనసన్మానంరామభక్త సీతయ్య కళాపరిషత్ తరపున సన్మానించిన మధిర బాబ్లా ఆత్కూరు బైపాస్ రోడ్ లోని కుందా సావిత్రి సేవాసమితి నందు గల ఉచిత హోమియో హాస్పిటల్ నందు గడచిన 15 సంవత్సరాలుగా వాలంటీర్ గా సేవలు అందిస్తున్న మాటూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణితోపాధ్యాయులు శ్రీ మేడేపల్లి శ్రీనివాసరావును కుందా సావిత్రి సేవాసమితి నిర్వాహకులు శ్రీ కుందా కోటేశ్వరరావు వారి కుమారులు కుందా నాగభూషణం, సంక్రాంతి శ్రీనివాసరావు  ఆధ్వర్యంలో ఘనంగాసన్మానించడంజరిగింది.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాలంటీర్ గా తాను సేవలు అందిస్తూ తన స్నేహితులను, విద్యార్థులను సేవలు అందించటానికి ప్రోత్సాహిస్తున్న ఎమ్మెస్సార్ కు అభినందనలు తెలియజేశారు. అనంతరం ఉపాధ్యాయులు చేడే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంఎస్ఆర్ కు అభినందనలు తెలియజేసిన వారి ఛాయా చిత్రాలను ఫోటో ఫ్రేమ్ ద్వారా కూర్పు చేసి అందించడం జరిగింది.అనంతరం రామభక్త సీతయ్య కళాపరిషత్ రథసారధి మధిర బాబ్లా చేతులమీదుగా ఎమ్మెస్సార్ కు మెమెంటో, దుస్సాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. తరువాత హోమియో హాస్పిటల్ లో వాలంటీర్లుగా సేవలు అందిస్తున్న వారందరికీ ప్రశంసాపత్రాలు మధిర బాబ్లా  చేతులమీదుగా అందించడం జరిగింది.
 ఈ కార్యక్రమంలో హోమియో హాస్పిటల్ డాక్టర్ కిలారు కామేశ్వరరావు, బొగ్గవరపు హరీష్, కడియాల కుటుంబరావు, చేడే శ్రీనివాస్, సుగ్గల రామకృష్ణారావు, చేడే సతీష్, చలువాది గోపికాంత్, బాచి తదితరులు పాల్గొన్నారు.