సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా రెండో రోజు మెగా రక్తదాన సేవా కార్యక్రమం

Published: Thursday February 17, 2022

కోరుట్ల, ఫిబ్రవరి 16 (ప్రజాపాలన ప్రతినిధి): టిఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవ కార్యక్రమాల్లో భాగంగా బుదవారం రోజున కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని జగిత్యాల జడ్పీ ఛైర్పర్సన్ దావా వసంత  మరియు టీఆర్ఎస్ నాయకులు డా.కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా రక్త దానం చేసిన ఐలాపూర్ కు చెందిన టిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు కుంటాల వికాస్ లింగంపల్లి రఘు మారంపల్లి అంజయ్య మారంపల్లి ప్రణయ్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య అనిల్, ఎంపీపీ తోట నారాయణ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మీ మనోహర్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చీటి వెంకట్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, సర్పంచులు రాధా సందయ్య, ఇప్ప మంగ రాజేందర్, భాస్కర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మల్లాపూర్ మండల అధ్యక్షులు తోట శ్రీను, టిఆర్ఎస్ పార్టీ  మండల యూత్ అధ్యక్షులు రాజ్ కుమార్, వినోద్, మల్లాపూర్ మండల యూత్ అధ్యక్షులు సతీష్, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు పుప్పాల నాగరాజు, బొలిశెట్టి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.