*మండల బూత్ స్థాయి కార్యకర్తలను బలపతం చేయాలి*

Published: Friday January 06, 2023
చేవెళ్ల జనవరి 05,(ప్రజాపాలన):-

చేవెళ్ల మండల కేంద్రంలో మండల  బూత్ స్థాయి కార్యవర్గ సమావేశం చేవెళ్ల  మండల అధ్యక్షులు దేవర పాండురంగారెడ్డి గారి* ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల అసెంబ్లీ పాలక్  ఏపీ జితేందర్ రెడ్డి,
చేవెళ్ల మాజీ ఎంపీ(కొండ విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యవర్గ సమావేశంలో ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ బూత్ స్థాయిలో కార్యకర్తలు బలోపేతం అయితేనే ప్రజాప్రతినిధులుగా ఎన్నిక అవుతారని
చేవెళ్ల అసెంబ్లీ పాలక్ ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు.
అనంతరం మండల కేంద్రంలో బూత్ స్థాయి, మండల నాయకులతో సమావేశమై, అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకుల అవినీతికి అధికార యంత్రాంగం వత్తాసు పలుకుతుందని అన్నారు.
సోషల్ మీడియా వేదికగా యువత స్పందించాలని జితేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సామాజిక బాధ్యతగా వ్యవహరించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సుపరిపాలన గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు,చేవెళ్ల అసెంబ్లీ నాయకులు,చేవెళ్ల మండల నాయకులు, మోర్చా నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు..